Home » Jyotirlingalu » Sri Bhimashankara Jyotirlingam

Sri Bhimashankara Jyotirlingam

శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం (Sri Bhimashankara Jyotirlingam)

యో డాకిని శాకినికా సమాజే, నిషేవ్యమానం పిశితాశానైశ్చ
సదైవ భీమాది పద ప్రసిద్ధం, తం శంకరం భక్తహితం నామామి

త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ, ప్రజలను పీడిస్తూండేవాడు. కర్కటి, పుష్కసి – కర్కటుల కూతురు. లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షసదంపతులు. యుక్తవయస్కురాలైన కర్కటిని విరాధునికి ఇచ్చి పెండ్లి చెశారు. ఆ విరాధుడు, శ్రీరామునితో జరిగిన యుద్ధంలో మరణించగా, మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానదిలో స్నానం చేస్తుండగా, కర్కటి తల్లిదండ్రులు అతనిని కబళీంచేందుకు ప్రయత్నించి, అ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా ఆ మిగిలింది. అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి, మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు, ఆమెను బలాత్కరించి, లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా కర్కటి గర్భనతై భీమాసురునికి జన్మనిచ్చింది. తన తల్లి కథను విన్న భీమాసురుడు, దీనంతాటికి కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని, వేయి సంవత్సరాలపాటు బ్రహ్మ గురించి తపస్సుచేసి వరాలను పొందాడు. ఎల్లలోకవాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదక్షిణుని ఓడించి కారాగృహంలో బందించాడు. అతని భార్య సుదక్షిణాదేవిని కూడ బంధిస్తాడు. కారాగారంలో సంకెళ్ళతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు, మానస గంగాస్నానం చేస్తూ, ఇసుకలింగాన్ని చేసి ఆరాద్ హించసాగారు. వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు. రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, త్రిశూలంతో రాక్షస సంహారం గావించాడు. సకలలోకవాసులు సంతోషించారు. అప్పటి నుంచి స్వామి వారు లోక కళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్తజనావళిని కరుణిస్తున్నాడు. ఎందరో భక్తుల కోరికలను తీస్తున్నాడు.

Dwadasha Jyotirlinga Stotram

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం (Dwadasha Jyotirlinga Stotram) సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చన్ద్రకలావతంసమ్ । భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1॥ శ్రీశైలశృఙ్గే విబుధాతిసఙ్గే తులాద్రితుఙ్గేఽపి ముదా వసన్తమ్ । తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్ ॥...

Sri Kalahasti Temple

శ్రీ కాళహస్తి క్షేత్రం (Sri Kalahasti temple) తిరుపతికి తూర్పున సువర్ణముఖి నది ఒడ్డున గల కొండల మధ్య నెలకొని ఉన్నది శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం. నామ సార్ధకత: శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు....

Sri Kasi Dandapani Avirbhavam

శ్రీ కాశి దండ పాణి ఆవిర్భావం (Sri Dandapani Avirbhavam) పూర్వం రత్న భద్రుడు యక్షుడుందే వాడు. పుణ్యాత్ముడు, ధార్మికుడు. అతనికి పూర్ణ భద్రుడనే కుమారుడున్నాడు . కుమారునికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రి అన్నిటి విషయాలు కొడుక్కి అప్ప...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!